Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ ప్రాంత విద్యార్థులకు ఎన్ ఆర్ ఎస్ విద్యాసంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయం "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 11, 2026 05:34 PM

పోలీస్ ఉద్యోగాల భర్తీకి డీవైఎఫ్‌ఐ సంతకాల ఉద్యమం. 19 వేల ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి.డీవైఎఫ్‌ఐ

పోలీస్ ఉద్యోగాల భర్తీకి డీవైఎఫ్‌ఐ సంతకాల ఉద్యమం. 19 వేల ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి.డీవైఎఫ్‌ఐ

పోలీస్ ఉద్యోగాల భర్తీకి డీవైఎఫ్‌ఐ సంతకాల ఉద్యమం.  19 వేల ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి.డీవైఎఫ్‌ఐ
June 11, 2026 03:44 PM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 19 వేల పోలీస్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపట్టకపోవడం వల్ల నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురవుతోందన్నారు. పోలీస్ ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా శ్రమిస్తున్న వేలాది మంది యువతీ, యువకులు నియామకాల జాప్యం కారణంగా వయోపరిమితి దాటిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తక్షణమే పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయాలని, అభ్యర్థులకు వయోపరిమితిని 40 సంవత్సరాలకు పెంచాలని, లాంగ్ జంప్ అర్హతను 3.8 మీటర్లుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.

సంతకాల సేకరణ కార్యక్రమానికి విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, నాయకులు మాదాసు రావణ్, బొమ్మనబోయిన రాజు, కొంగల ప్రసాద్, మల్లం రోహిత్, అదిమల్లా భగత్, శ్రీకాంత్, శివ, అనిల్, రాము, అశోక్, హరీష్, ప్రశాంతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News