Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూలై 5న ‘రాజ్యాధికార సమరభేరి’ని విజయవంతం చేయాలి యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 11:12 PM

భూగేని చెరువుకు కొత్త సొబగులు. రూ.48 లక్షల అభివృద్ధి పనుల పరిశీలన కోసిగి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం: ఎన్. రాకేష్ రెడ్డి

భూగేని చెరువుకు కొత్త సొబగులు. రూ.48 లక్షల అభివృద్ధి పనుల పరిశీలన కోసిగి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం: ఎన్. రాకేష్ రెడ్డి

భూగేని చెరువుకు కొత్త సొబగులు. రూ.48 లక్షల అభివృద్ధి పనుల పరిశీలన కోసిగి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం: ఎన్. రాకేష్ రెడ్డి
June 10, 2026 08:44 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కోసిగి,

మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి పట్టణం 3, 4 వార్డుల పరిధిలో ఉన్న భూగేని చెరువు ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి పనులను మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి తనయుడు, యువ నాయకుడు ఎన్. రాకేష్ రెడ్డి పరిశీలించారు.

ఇటీవల రూ.48 లక్షల వ్యయంతో ప్రారంభమైన అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, సంబంధిత అధికారులు, స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్, బెంచీలు, సోలార్ లైట్లు, చిన్నారుల పార్కు, ఆట వస్తువులు, ఆకర్షణీయ ఆర్చ్ నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కోసిగి పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి అభివృద్ధి పనిని నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూగేని చెరువు ప్రాంతాన్ని పట్టణ ప్రజలకు ప్రత్యేక విహార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ సందర్శనలో టీడీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News