Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యువత ప్రతిభకు పట్టాభిషేకం.. ఉజ్వల భవిష్యత్‌కు మార్గదర్శనం యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 05:12 PM

దివ్యాంగుల హక్కుల చట్టం అమలుకు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా. భువనగిరి ఎంపీ దామల కిరణ్‌కుమార్ రెడ్డి.

దివ్యాంగుల హక్కుల చట్టం అమలుకు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా. భువనగిరి ఎంపీ దామల కిరణ్‌కుమార్ రెడ్డి.

దివ్యాంగుల హక్కుల చట్టం అమలుకు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా.  భువనగిరి ఎంపీ దామల కిరణ్‌కుమార్ రెడ్డి.
June 10, 2026 03:53 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన 2016 దివ్యాంగుల హక్కుల చట్టం అమలులోకి వచ్చి పదేళ్లు పూర్తవుతున్నా, అందులోని అనేక కీలక అంశాలు ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం వల్ల దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భువనగిరి ఎంపీ దామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. దివ్యాంగుల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించి చట్టం అమలుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తన నివాసంలో దివ్యాంగుల విశ్వవిద్యాలయాల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్‌తో ఎంపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ రూపొందించిన 2016 దివ్యాంగుల హక్కుల చట్టానికి సంబంధించిన ముఖ్యాంశాల పుస్తకాన్ని పరిశీలించి, అందులోని అంశాలను అధ్యయనం చేశారు.

దివ్యాంగుల విద్య, ఉపాధి, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో చట్టం అమలు జరగకపోవడం వల్ల సమస్యలు కొనసాగుతున్నాయని డాక్టర్ అశోక్ వివరించారు. దీనిపై స్పందించిన ఎంపీ, దివ్యాంగుల హక్కుల సాధన కోసం పార్లమెంట్‌లో గళం వినిపించడంతో పాటు చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

ఈ సమావేశంలో మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ తాటిపాముల శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News