దివ్యాంగుల హక్కుల చట్టం అమలుకు పార్లమెంట్లో ప్రస్తావిస్తా. భువనగిరి ఎంపీ దామల కిరణ్కుమార్ రెడ్డి.
దివ్యాంగుల హక్కుల చట్టం అమలుకు పార్లమెంట్లో ప్రస్తావిస్తా. భువనగిరి ఎంపీ దామల కిరణ్కుమార్ రెడ్డి.
Editor Desk
హైదరాబాద్,
దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన 2016 దివ్యాంగుల హక్కుల చట్టం అమలులోకి వచ్చి పదేళ్లు పూర్తవుతున్నా, అందులోని అనేక కీలక అంశాలు ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం వల్ల దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భువనగిరి ఎంపీ దామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. దివ్యాంగుల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి చట్టం అమలుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తన నివాసంలో దివ్యాంగుల విశ్వవిద్యాలయాల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్తో ఎంపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ రూపొందించిన 2016 దివ్యాంగుల హక్కుల చట్టానికి సంబంధించిన ముఖ్యాంశాల పుస్తకాన్ని పరిశీలించి, అందులోని అంశాలను అధ్యయనం చేశారు.
దివ్యాంగుల విద్య, ఉపాధి, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో చట్టం అమలు జరగకపోవడం వల్ల సమస్యలు కొనసాగుతున్నాయని డాక్టర్ అశోక్ వివరించారు. దీనిపై స్పందించిన ఎంపీ, దివ్యాంగుల హక్కుల సాధన కోసం పార్లమెంట్లో గళం వినిపించడంతో పాటు చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
ఈ సమావేశంలో మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ తాటిపాముల శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి