యువత ప్రతిభకు పట్టాభిషేకం.. ఉజ్వల భవిష్యత్కు మార్గదర్శనం
యువత ప్రతిభకు పట్టాభిషేకం.. ఉజ్వల భవిష్యత్కు మార్గదర్శనం
Krishna
నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్రతిభకు పట్టాభిషేకం” కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి సరైన మార్గదర్శకత్వం, ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. యువత భవిష్యత్తు నిర్మాణంలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు తాహిర్ అలీ, మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, లక్ష్మణ్,మైతబ్, నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, ఎస్సై శ్రీశైలం, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి