పెండింగ్ బడి భవన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలి: సీపీఎం
చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలోని పల్లె దవాఖానాలో వెంటనే ప్రభుత్వ వైద్యుడిని నియమించాలని, పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీపీఎం బృందం డిమాండ్ చేసింది. గురువారం జైకేసారంలోని ప్రభుత్వ పాఠశాల, పల్లె దవాఖానాలను సీపీఎం నాయకులు సందర్శించి సమస్యలపై సర్వే చేపట్టారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు రాగీరు కృష్ణయ్య మాట్లాడుతూ... పల్లె దవాఖానాలో శాశ్వత డాక్టర్ లేక, కనీస మందులు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే వైద్యుడిని నియమించి మందులు అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే, 'మన ఊరు – మన బడి' కింద మంజూరై పెండింగ్లో ఉన్న పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. బడులు ప్రారంభమై మూడు నెలలవుతున్నా విద్యార్థులకు యూనిఫాంలు ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు పొట్ట శ్రీనివాస్, బోదాసు వెంకటేష్, ఉపసర్పంచ్ బోదాసు స్వాతి, వార్డు సభ్యురాలు నక్క జయసుధ, పార్టీ నాయకులు పొట్ట సాంబశివుడు, రాగీరు యాదయ్య, వనం శ్రీను, డీవైఎఫ్ఐ నాయకులు బోదాసు నరేష్, పల్లె శివకుమార్, రుద్రగోని మధు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి