Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పీఆర్సీని వెంటనే ప్రకటించాలి – తపస్ సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి.. ఆరు డీఏలను ఒకేసారి విడుదల చేయాలి. తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 07:06 PM

పల్లె దవాఖానాకు డాక్టర్‌ను నియమించాలి

పల్లె దవాఖానాకు డాక్టర్‌ను నియమించాలి

పల్లె దవాఖానాకు డాక్టర్‌ను నియమించాలి
06-08-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పెండింగ్ బడి భవన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలి: సీపీఎం

చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలోని పల్లె దవాఖానాలో వెంటనే ప్రభుత్వ వైద్యుడిని నియమించాలని, పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీపీఎం బృందం డిమాండ్ చేసింది. గురువారం జైకేసారంలోని ప్రభుత్వ పాఠశాల, పల్లె దవాఖానాలను సీపీఎం నాయకులు సందర్శించి సమస్యలపై సర్వే చేపట్టారు.​ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు రాగీరు కృష్ణయ్య మాట్లాడుతూ... పల్లె దవాఖానాలో శాశ్వత డాక్టర్ లేక, కనీస మందులు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే వైద్యుడిని నియమించి మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ​అలాగే, 'మన ఊరు – మన బడి' కింద మంజూరై పెండింగ్‌లో ఉన్న పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. బడులు ప్రారంభమై మూడు నెలలవుతున్నా విద్యార్థులకు యూనిఫాంలు ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు పొట్ట శ్రీనివాస్, బోదాసు వెంకటేష్, ఉపసర్పంచ్ బోదాసు స్వాతి, వార్డు సభ్యురాలు నక్క జయసుధ, పార్టీ నాయకులు పొట్ట సాంబశివుడు, రాగీరు యాదయ్య, వనం శ్రీను, డీవైఎఫ్‌ఐ నాయకులు బోదాసు నరేష్, పల్లె శివకుమార్, రుద్రగోని మధు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పల్లె దవాఖానాకు డాక్టర్‌ను నియమించాలి

Article Image

పెండింగ్ బడి భవన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలి: సీపీఎం

చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలోని పల్లె దవాఖానాలో వెంటనే ప్రభుత్వ వైద్యుడిని నియమించాలని, పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీపీఎం బృందం డిమాండ్ చేసింది. గురువారం జైకేసారంలోని ప్రభుత్వ పాఠశాల, పల్లె దవాఖానాలను సీపీఎం నాయకులు సందర్శించి సమస్యలపై సర్వే చేపట్టారు.​ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు రాగీరు కృష్ణయ్య మాట్లాడుతూ... పల్లె దవాఖానాలో శాశ్వత డాక్టర్ లేక, కనీస మందులు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే వైద్యుడిని నియమించి మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ​అలాగే, 'మన ఊరు – మన బడి' కింద మంజూరై పెండింగ్‌లో ఉన్న పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. బడులు ప్రారంభమై మూడు నెలలవుతున్నా విద్యార్థులకు యూనిఫాంలు ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు పొట్ట శ్రీనివాస్, బోదాసు వెంకటేష్, ఉపసర్పంచ్ బోదాసు స్వాతి, వార్డు సభ్యురాలు నక్క జయసుధ, పార్టీ నాయకులు పొట్ట సాంబశివుడు, రాగీరు యాదయ్య, వనం శ్రీను, డీవైఎఫ్‌ఐ నాయకులు బోదాసు నరేష్, పల్లె శివకుమార్, రుద్రగోని మధు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News