Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:36 AM

అధికారుల నిర్లక్ష్యంతో బీమా కోల్పోయిన పంచాయతీ కార్మికుడి కుటుంబం

అధికారుల నిర్లక్ష్యంతో బీమా కోల్పోయిన పంచాయతీ కార్మికుడి కుటుంబం

అధికారుల నిర్లక్ష్యంతో బీమా కోల్పోయిన పంచాయతీ కార్మికుడి కుటుంబం
06-08-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బాధ్యులపై చర్యలు తీసుకుని కుటుంబాన్ని ఆదుకోవాలి: సీఐటీయూ జిల్లా నాయకుడు మద్దాల ప్రభాకరరావు

ఎర్రుపాలెం, ఆగస్టు 6: గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం కల్పించిన జీవిత బీమా పథకం అమలులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబం ఆర్థిక భరోసాను కోల్పోయిందని సీఐటీయూ జిల్లా నాయకుడు మద్దాల ప్రభాకరరావు ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు, బాధిత కుటుంబానికి ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎర్రుపాలెం మండలంలోని బనిగండ్లపాడు గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న బలుసుపాటి ప్రసాద్ మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రభాకరరావు, సీఐటీయూ నాయకులు, పంచాయతీ కార్మికులతో కలిసి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికులకు పంచాయతీ నిధుల నుంచి జీవిత బీమా ప్రీమియం చెల్లించాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, సంబంధిత అధికారులు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ప్రీమియం చెల్లించకపోవడం వల్ల మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి అందాల్సిన బీమా ప్రయోజనం అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికుల కుటుంబాలకు రక్షణ కల్పించాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధిత కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కో-కన్వీనర్ దూదిగం బసవయ్య, పంచాయతీ కార్మికులు గంతాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అధికారుల నిర్లక్ష్యంతో బీమా కోల్పోయిన పంచాయతీ కార్మికుడి కుటుంబం

Article Image

బాధ్యులపై చర్యలు తీసుకుని కుటుంబాన్ని ఆదుకోవాలి: సీఐటీయూ జిల్లా నాయకుడు మద్దాల ప్రభాకరరావు

ఎర్రుపాలెం, ఆగస్టు 6: గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం కల్పించిన జీవిత బీమా పథకం అమలులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబం ఆర్థిక భరోసాను కోల్పోయిందని సీఐటీయూ జిల్లా నాయకుడు మద్దాల ప్రభాకరరావు ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు, బాధిత కుటుంబానికి ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎర్రుపాలెం మండలంలోని బనిగండ్లపాడు గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న బలుసుపాటి ప్రసాద్ మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రభాకరరావు, సీఐటీయూ నాయకులు, పంచాయతీ కార్మికులతో కలిసి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికులకు పంచాయతీ నిధుల నుంచి జీవిత బీమా ప్రీమియం చెల్లించాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, సంబంధిత అధికారులు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ప్రీమియం చెల్లించకపోవడం వల్ల మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి అందాల్సిన బీమా ప్రయోజనం అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికుల కుటుంబాలకు రక్షణ కల్పించాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధిత కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కో-కన్వీనర్ దూదిగం బసవయ్య, పంచాయతీ కార్మికులు గంతాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News