జేబీఎం కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు
వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రహదారి ప్రమాదాలను అరికట్టవచ్చని చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధకుమార్ తెలిపారు. ‘సైబర్ స్వతంత్ర తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని మార్కండేయ నగర్ జేబీఎం ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ‘సురక్షిత రహదారి – సురక్షిత జీవితం’ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, నిబంధనలు పాటించడం ద్వారా సురక్షిత ప్రయాణాన్ని సాగించవచ్చని సూచించారు.అనంతరం పీసీ మమత సైబర్ నేరాల గురించి వివరిస్తూ.. ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులు, అపరిచిత వ్యక్తుల కాల్స్కు స్పందించవద్దని స్పష్టం చేశారు. ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ అజయ్ భార్గవ్, కళాశాల ప్రిన్సిపాల్ గంగాపురం జంగయ్య, కరస్పాండెంట్ నిర్మల, అధ్యాపకులు మాధవి, రంజిత్, యువరాజు, స్వాతి, మమత, జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి