రామన్నపేట: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను నకిరేకల్ శాసనసభ్యులు, తెలంగాణ ప్రభుత్వ విప్ వేముల వీరేశం సహకారంతో రామన్నపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజలు ఆపదలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక భరోసాగా నిలుస్తోందని పేర్కొన్నారు. వైద్య చికిత్సలు, అత్యవసర అవసరాల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం నిరుపేద కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, వార్డు సభ్యుడు మోటే మహేష్, కందుల అండాలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండ అంజిరెడ్డి, అక్క యాదయ్య, పిట్ట రామిరెడ్డి, శంబాల వెంకన్న, చింతల కృష్ణ, గొలుసుల ప్రసాద్, మాల్గా వెంకటేష్, బండ బాలరాజ్, బొడ్డు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి