సూర్యాపేట జిల్లా కేంద్రంలో మెట్రో ట్రేడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జలకన్య ఎగ్జిబిషన్ సూర్యాపేట జిల్లా ప్రజలను అలరించడం ఉందని ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,మాజీ టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది*అన్నారు.
మంగళవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 36వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటుచేసిన జలకన్య ఎగ్జిబిషన్ వారు ప్రారంభించి మాట్లాడారు. చిన్నలను పెద్దలను అలరించేలా జలకన్య షోతో పాటు ఆనందాన్ని పంచే జెయింట్ వీల్, బ్రేక్ డాన్స్, అందరికీ ఉపయోగపడే స్టాల్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.
పిల్లలు పాఠశాలలకు సెలవులు వచ్చినప్పుడు కొత్తగా ఏదైనా కోరుకుంటారని అలాంటి సమయంలో ఇలాంటి ఎగ్జిబిషన్లో ఎంతగానో ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు. దూరప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసిన నిర్వాహకులను అభినందించారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో ఎగ్జిబిషన్ ఐటమ్స్ ను ఉంచడంతో పాటు తగిన సౌకర్యాలు కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఇలాంటి ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసే వారికి తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. సూర్యాపేట పట్టణ ప్రజలు జలకన్య ఎగ్జిబిషను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి