జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలి
జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలి
K.RAVI
పోస్టర్ ఆవిష్కరించిన చౌటుప్పల్ పురపాలక చైర్మన్, వైస్ చైర్మన్
ఆగస్టు 7న బెంగళూరులో జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభను జయప్రదం చేయాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ స్థానిక గాంధీ పార్క్లో బీసీ యువజన, విద్యార్థి సంఘాల మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్, బండిగారి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార వాల్ పోస్టర్ను వారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీసీల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, విద్యా-ఉపాధి, రాజకీయ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం సాధించడమే లక్ష్యంగా ఈ మహాసభ జరుగుతోందన్నారు. బీసీల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమని, ఆగస్టు 7న బెంగళూరులో జరిగే ఈ సభకు ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, విద్యార్థులు, యువకులు భారీ సంఖ్యలో తరలివెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆలే చిరంజీవి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి సిలువేరు శ్రీనివాస్, నాయకులు ఉష్కాగుల నాగరాజు, కర్నాటి శ్యాంసుందర్, ప్రవీణ్, నవీన్, ప్రదీప్, ఆకాష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి