శాంతినగర్లో పెద్ద మోరి నిర్మాణానికి శంకుస్థాపన!
శాంతినగర్లో పెద్ద మోరి నిర్మాణానికి శంకుస్థాపన!
K.RAVI
పట్టణ పరిధిలోని శాంతినగర్ కారం పిండి గిండ్రి నుండి విద్యానగర్ వరకు ఎన్నో ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న పెద్ద మోరి (డ్రైనేజీ) సమస్యకు పరిష్కారం లభించింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో, రూపుదిద్దుకోనున్న ఈ మురుగు కాలువ నిర్మాణ పనులకు చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్ మంగళవారం ఘనంగా శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలనీవాసులకు ఎంతోకాలంగా మురుగునీటితో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ మెంబర్ ఎస్.కే. నవేబి జానీ బాబు, కాలనీల అధ్యక్షులు పెద్దగోని రమేష్ గౌడ్, హనుమంత్ రెడ్డి, శశిధర్ రెడ్డి, నాయకులు నాగభూషణం, దోనూరి లావణ్య, చిలకల శ్రీనివాస్ యాదవ్, రమావతి, తమ్మకొండ నవీన్ కుమార్, మాస సుధాకర్, జాజుల శివ, జాల శ్రీకాంత్, సత్తిరెడ్డి, 12వ వార్డు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి