న్యాయవాది హత్యపై నల్లకోట్ల ఆగ్రహం. రామన్నపేట కోర్టులో విధుల బహిష్కరణ..
న్యాయవాది హత్యపై నల్లకోట్ల ఆగ్రహం. రామన్నపేట కోర్టులో విధుల బహిష్కరణ..
Editor Desk
రామన్నపేట,
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కోర్టు పరిధికి చెందిన న్యాయవాది మల్లయ్య దారుణ హత్యను ఖండిస్తూ రామన్నపేట కోర్టు న్యాయవాదులు మంగళవారం విధులను పూర్తిగా బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. నల్లకోట్లతో కోర్టు ఆవరణలో ఆందోళన చేపట్టి, హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.డి. మజీద్ మాట్లాడుతూ.. సభ్య సమాజంలో హత్యలతో సమస్యలకు పరిష్కారం లభించదన్నారు. న్యాయవాదిపై జరిగిన దారుణ దాడి న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. నిందితులను చట్టం ముందు నిలబెట్టి కఠిన శిక్ష విధించాలని కోరారు.
ఐఎల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామీడి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. "న్యాయవాది మల్లయ్య హత్య అంటే న్యాయవ్యవస్థపైనే దాడి చేసినట్లే" అని వ్యాఖ్యానించారు. సమాజంలో పెరుగుతున్న దాడులు, హత్యల సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మల్లయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బాలరాజు, ప్రధాన కార్యదర్శి యాదాసు యాదయ్య, ఉయ్యాల హనుమంతు గౌడ్, బాతరాజు అశోక్ కుమార్, అమానుల్లా ఖాన్, నోముల స్వామి, గడ్డం నరసింహ, సతీష్ రెడ్డి, అజీజుద్దీన్, సురేష్, మల్లేష్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి