పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి.. భీమ్రా గ్రామసభలో వ్యవసాయ అధికారుల సూచనలు
పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి.. భీమ్రా గ్రామసభలో వ్యవసాయ అధికారుల సూచనలు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలోని భీమ్రా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో వ్యవసాయ విస్తరణాధికారి సంతోష్ పత్తి రైతులకు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యవసాయ శాఖ సూచించే శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తే పత్తి పంటను సురక్షితంగా కాపాడుకోవచ్చని తెలిపారు. వర్షపు నీరు పొలాల్లో ఎక్కువసేపు నిల్వ ఉండటం వల్ల వేరుకుళ్లు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పొలాల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, పంటను తరచూ పరిశీలించాలని సూచించారు. వేరుకుళ్ల నివారణ కోసం వ్యవసాయ శాఖ సూచించిన మోతాదులో కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును నీటిలో కలిపి మొక్కల అడుగు భాగంలో వేయాలని, మందులను అధికారుల సూచనల మేరకే వినియోగించాలని రైతులకు సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైతులు అధైర్యపడకుండా వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తూ పంటను రక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నడిమిదొడ్డి బాబు, పంచాయతీ కార్యదర్శి తస్లీమ్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి