Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి శిశువుకు తొలి ఆహారం తల్లిపాలే – ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాల ప్రాధాన్యతను ప్రతి కుటుంబం గుర్తించాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 03, 2026 09:49 PM

పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి.. భీమ్రా గ్రామసభలో వ్యవసాయ అధికారుల సూచనలు

పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి.. భీమ్రా గ్రామసభలో వ్యవసాయ అధికారుల సూచనలు

పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి.. భీమ్రా గ్రామసభలో వ్యవసాయ అధికారుల సూచనలు
August 03, 2026 07:38 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలోని భీమ్రా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో వ్యవసాయ విస్తరణాధికారి సంతోష్ పత్తి రైతులకు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యవసాయ శాఖ సూచించే శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తే పత్తి పంటను సురక్షితంగా కాపాడుకోవచ్చని తెలిపారు. వర్షపు నీరు పొలాల్లో ఎక్కువసేపు నిల్వ ఉండటం వల్ల వేరుకుళ్లు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పొలాల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, పంటను తరచూ పరిశీలించాలని సూచించారు. వేరుకుళ్ల నివారణ కోసం వ్యవసాయ శాఖ సూచించిన మోతాదులో కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును నీటిలో కలిపి మొక్కల అడుగు భాగంలో వేయాలని, మందులను అధికారుల సూచనల మేరకే వినియోగించాలని రైతులకు సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైతులు అధైర్యపడకుండా వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తూ పంటను రక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నడిమిదొడ్డి బాబు, పంచాయతీ కార్యదర్శి తస్లీమ్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News