ప్రతి శిశువుకు తొలి ఆహారం తల్లిపాలే – ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాల ప్రాధాన్యతను ప్రతి కుటుంబం గుర్తించాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
ప్రతి శిశువుకు తొలి ఆహారం తల్లిపాలే – ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాల ప్రాధాన్యతను ప్రతి కుటుంబం గుర్తించాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
Krishna
శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలే అత్యంత విలువైన తొలి ఆహారమని, పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించడం ద్వారా శిశువుకు సహజ రోగనిరోధక శక్తి పెరిగి అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శిశువు పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు (కొలస్ట్రం) తప్పనిసరిగా అందించాలని, అవి శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది వేయడంతో పాటు తల్లి–శిశువు మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల శిశువుకు అవసరమైన అన్ని పోషకాలు అందుతాయని, ప్రతి కుటుంబం తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించి తల్లులను ప్రోత్సహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జ్యోతి, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవి, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, ఆర్డీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి