కోమాలో ఉన్న యువకుడికి మంత్రి రూ.1 లక్ష ఆర్థిక సాయం కొత్తపల్లి,
కోమాలో ఉన్న యువకుడికి మంత్రి రూ.1 లక్ష ఆర్థిక సాయం కొత్తపల్లి,
Editor Desk
కొత్తపల్లి, ఆగస్టు 4: కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈసం అనూజ్ కుమార్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి మానవత్వాన్ని చాటుతూ రూ.1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
బాధితుడి పరిస్థితిని తెలుసుకున్న మంత్రి వెంటనే స్పందించి ఈ సహాయాన్ని మంజూరు చేశారు. ఈ ఆర్థిక సాయం అందేలా చేయడంలో గుమ్మల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్యతో పాటు కొత్తపల్లి కాంగ్రెస్ నాయకులు విశేషంగా కృషి చేసి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే సహాయం అందించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఈసం అనూజ్ కుమార్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి