హెల్మెట్ తప్పనిసరి... రోడ్డు భద్రత అందరి బాధ్యత: నాగల్గిద్ద ఎస్ఐ రామకృష్ణ
హెల్మెట్ తప్పనిసరి... రోడ్డు భద్రత అందరి బాధ్యత: నాగల్గిద్ద ఎస్ఐ రామకృష్ణ
Krishna
రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించేందుకు నాగల్గిద్ద పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సోమవారం 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు నాగల్గిద్ద ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు రోడ్డు భద్రతపై సందేశం అందించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగంగా వాహనాలు నడపరాదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ ఉపయోగించరాదని, ట్రిపుల్ రైడింగ్కు పాల్పడరాదని ఎస్ఐ రామకృష్ణ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించి సురక్షితంగా గమ్యానికి చేరుకోవచ్చని ఆయన తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి