సీసీ రోడ్డు పనులకు శ్రీకారం.. దోసపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్ బిరాదర్ దత్తు
సీసీ రోడ్డు పనులకు శ్రీకారం.. దోసపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్ బిరాదర్ దత్తు
Krishna
మనూర్ మండలంలోని దోసపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని గ్రామ సర్పంచ్, మనూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బిరాదర్ దత్తు అన్నారు. సోమవారం గ్రామంలోని శివాలయం ఆవరణలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని, ప్రజల సహకారంతో గ్రామంలో రహదారులు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు. ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ పట్టోళ్ల సంజీవరెడ్డి సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు గ్రామానికి తీసుకువచ్చి దోసపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఆర్ఏఈ రజనీకాంత్, పంచాయతీ కార్యదర్శి బాలు, లింగం పటేల్, బసన్న, నారాయణ, అశోక్, కుశప్ప, అశోక్ డీలర్, సత్యనారాయణ, ఈరన్న, అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి