Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి శిశువుకు తొలి ఆహారం తల్లిపాలే – ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాల ప్రాధాన్యతను ప్రతి కుటుంబం గుర్తించాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 03, 2026 09:46 PM

యూరియా కొరతను నివారించాలి: బీఎస్పీ ​ఆర్డీఓకు వినతిపత్రం అందజేత

యూరియా కొరతను నివారించాలి: బీఎస్పీ ​ఆర్డీఓకు వినతిపత్రం అందజేత

యూరియా కొరతను నివారించాలి: బీఎస్పీ ​ఆర్డీఓకు వినతిపత్రం అందజేత
August 03, 2026 07:20 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లాలో యూరియా ఎరువుల కొరత, యాప్ ఆధారిత పంపిణీ విధానం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి ఐతరాజు అభయేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం చౌటుప్పల్ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి, పత్తి తదితర పంటలకు యూరియా అత్యవసరమైన తరుణంలో రైతులు దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. యాప్ ద్వారానే బుకింగ్ నిబంధన వల్ల సాంకేతిక పరిజ్ఞానం లేని చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు. ​ప్రతి ఎరువుల దుకాణంలో తగినంత యూరియా నిల్వలను అందుబాటులో ఉంచాలి. ​యాప్‌తో పాటు ఆఫ్‌లైన్ విధానంలోనూ ఎరువులు పంపిణీ చేయాలి.​క్యూ లైన్ల అవస్థలు తప్పించేందుకు గ్రామాల వారీగా లేదా టోకెన్ల ద్వారా అందించాలి. ​బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలపై విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేపట్టాలి అన్నారు.​ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, నియోజకవర్గ ఇన్‌చార్జి బొట్ట శివ, నియోజకవర్గ అధ్యక్షుడు తగరం శుభాష్ చంద్రబోస్, నియోజకవర్గ కోశాధికారి మాధ రమేష్, నారాయణపురం మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల గిరి, సీనియర్ నాయకులు ఎర్రోళ్ల వెంకటయ్య, కత్తుల నర్సింహ, కురిమిద్ద యాదయ్య, ఖైతాపురం శివ, రైతులు మల్లయ్య, శివయ్య, అబ్బయ్య, ఈశ్వరయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News