యూరియా కొరతను నివారించాలి: బీఎస్పీ ఆర్డీఓకు వినతిపత్రం అందజేత
యూరియా కొరతను నివారించాలి: బీఎస్పీ ఆర్డీఓకు వినతిపత్రం అందజేత
K.RAVI
యాదాద్రి భువనగిరి జిల్లాలో యూరియా ఎరువుల కొరత, యాప్ ఆధారిత పంపిణీ విధానం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి ఐతరాజు అభయేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం చౌటుప్పల్ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి, పత్తి తదితర పంటలకు యూరియా అత్యవసరమైన తరుణంలో రైతులు దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. యాప్ ద్వారానే బుకింగ్ నిబంధన వల్ల సాంకేతిక పరిజ్ఞానం లేని చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఎరువుల దుకాణంలో తగినంత యూరియా నిల్వలను అందుబాటులో ఉంచాలి. యాప్తో పాటు ఆఫ్లైన్ విధానంలోనూ ఎరువులు పంపిణీ చేయాలి.క్యూ లైన్ల అవస్థలు తప్పించేందుకు గ్రామాల వారీగా లేదా టోకెన్ల ద్వారా అందించాలి. బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలపై విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేపట్టాలి అన్నారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, నియోజకవర్గ ఇన్చార్జి బొట్ట శివ, నియోజకవర్గ అధ్యక్షుడు తగరం శుభాష్ చంద్రబోస్, నియోజకవర్గ కోశాధికారి మాధ రమేష్, నారాయణపురం మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల గిరి, సీనియర్ నాయకులు ఎర్రోళ్ల వెంకటయ్య, కత్తుల నర్సింహ, కురిమిద్ద యాదయ్య, ఖైతాపురం శివ, రైతులు మల్లయ్య, శివయ్య, అబ్బయ్య, ఈశ్వరయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి