నోముల నారాయణ మృతి. కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి
నోముల నారాయణ మృతి. కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి
Editor Desk
రామన్నపేట మండలం నీర్నేముల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నోముల నారాయణ మృతి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి నారాయణ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, నోముల నారాయణ సేవలు గ్రామ ప్రజలకు చిరస్మరణీయమని, ఆయన మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఆవుల నరసింహ, సీనియర్ నాయకుడు ఆవుల సత్యనారాయణ, మండల నాయకుడు చల్ల సత్యప్రకాశ్, మాజీ వార్డు సభ్యుడు నోముల ప్రవీణ్, నోముల విష్ణు, సుర్వి శివకృష్ణ, వరుస తిరుమలయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి