కోదాడ పట్టణంలో వాహనాల ముమ్మర తనిఖీ 50 వాహనాలు సీజ్
కోదాడ పట్టణంలో వాహనాల ముమ్మర తనిఖీ 50 వాహనాలు సీజ్
Harish K
కోదాడ పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పోలీసులు శనివారం ఉక్కుపాదం మోపారు. కోదాడ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా ఒకే బైక్పై ముగ్గురు ప్రయాణించడం (ట్రిపుల్ రైడింగ్), మైనర్లు వాహనాలు నడపడం, మరియు నంబర్ ప్లేట్లు లేని 50 వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వాహనాలను పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు.అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహన చోదకులకు, మైనర్ల తల్లిదండ్రులకు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, టౌన్ ఇన్స్పెక్టర్ శివశంకర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై నిఘా ఉంచుతామని, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రమాదాల నివారణకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్, టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి