బాలల సభలో విద్యార్థులకు విలువైన అవగాహన కల్పించిన; సర్పంచ్ మల్లేష్
బాలల సభలో విద్యార్థులకు విలువైన అవగాహన కల్పించిన; సర్పంచ్ మల్లేష్
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలం సంగెం గ్రామ పాఠశాలలో బాలల గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి సర్పంచ్ కలకోట్ల మల్లేష్ పాల్గొని మాట్లాడుతూ... బాలలసభ అనేది మనలోని ప్రతిభను వెలికితీసే వేదిక. ఇక్కడ ప్రసంగాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మన ఆత్మవిశ్వాసం పెరుగుతుందనీ అన్నారు. అలాగే నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సమయపాలన మరియు వేదికపై మాట్లాడే నైపుణ్యం కూడా అభివృద్ధి చెందుతాయనీ అన్నారు.విద్యార్థులు బాగా చదవడంతో పాటు మంచి నడవడి, పెద్దల పట్ల గౌరవం, ఉపాధ్యాయుల పట్ల మర్యాద, తోటి విద్యార్థులతో స్నేహభావం కలిగి ఉండాలనీ. మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించి పుస్తక పఠనం, ఆటలు మరియు సృజనాత్మక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాలనీ అన్నారు.
పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడం, మొక్కలు నాటడం, పర్యావరణాన్ని కాపాడడం మరియు సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయడం ప్రతి విద్యార్థి బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి