జైపాల్రెడ్డికి శ్రుతివనంలో ఘన నివాళి. ఆయన స్ఫూర్తితో హక్కుల సాధనకు ముందుకు రావాలి: డా. ఎన్. అశోక్.
జైపాల్రెడ్డికి శ్రుతివనంలో ఘన నివాళి. ఆయన స్ఫూర్తితో హక్కుల సాధనకు ముందుకు రావాలి: డా. ఎన్. అశోక్.
Editor Desk
హైదరాబాద్:
కేంద్ర మాజీ మంత్రి, మాజీ పార్లమెంటేరియన్ ఎస్. జైపాల్రెడ్డి ఏడో వర్ధంతి సందర్భంగా శ్రుతివనం ఘాట్లో రాష్ట్ర దివ్యాంగుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డా. ఎన్. అశోక్ మాట్లాడుతూ.. అంగవైకల్యం శరీరానికే కానీ జ్ఞానానికి కాదని నిరూపించిన మహనీయుడు జైపాల్రెడ్డి అని కొనియాడారు. అత్యున్నత ప్రజాసేవతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.
జైపాల్రెడ్డి స్ఫూర్తితో దివ్యాంగులు రాజకీయాల్లో చైతన్యవంతులై తమ హక్కులు, ఆత్మగౌరవం కోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో దివ్యాంగుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్, మహిళా సాధికారిక రాష్ట్ర అధ్యక్షురాలు కోళ్ల రాజ్యలక్ష్మి, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు ధోరపల్లి దానమ్మ, సహాయ కార్యదర్శి మోదల సైదులు యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. స్వప్న తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి