Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడలో ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీలు తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 27, 2026 10:09 PM

అత్యంత ప్రతిభావంతులకు పూర్వ విద్యార్థుల పురస్కారాలు

అత్యంత ప్రతిభావంతులకు పూర్వ విద్యార్థుల పురస్కారాలు

అత్యంత ప్రతిభావంతులకు పూర్వ విద్యార్థుల పురస్కారాలు
July 27, 2026 08:04 PM 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ జడ్పీహెచ్‌ఎస్

పాఠశాలలో ఘనంగా బహుమతుల ప్రధానోత్సవం

ఏకాగ్రత, క్రమశిక్షణతో విద్యనభ్యసించినప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని విశ్రాంత మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) ఎం.ఎస్. కృష్ణమూర్తి అన్నారు. చౌటుప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1978- 79 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో 2025- 26 విద్యా సంవత్సరంలో 9, 10వ తరగతుల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పారితోషికం, జ్ఞాపికలతో పురస్కారాలను అందజేశారు. ​పాఠశాల గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శివకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎం.ఎస్. కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే దేశం పట్ల భక్తి, ధర్మం పట్ల అనురక్తిని పెంపొందించుకోవాలని, గురువులను గౌరవిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ​సిద్ధార్థి పురస్కారం 10వ తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచిన యం. డి. సమ్రీన్, ​శ్రీ విద్యా పురస్కారం ఇంగ్లీషు సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన ఏ. మణి సాయి, యం. డి. ఇర్ఫాన్ బాబా, బడుగు రామస్వామి కమలమ్మ విజ్ఞాన వికాస పురస్కారం 9వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన జి. చరణ్ కుమార్ లకు పురస్కారాలను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బడుగు శ్రీరాములు, కళ్లెం అంజిరెడ్డి, చింతల కరుణాకర్ రెడ్డి, కర్నాటి సత్యనారాయణ, బొబ్బిళ్ళ వెంకటేశ్వర కుమార్, అంబటి ప్రమీల, లలిత, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News