అత్యంత ప్రతిభావంతులకు పూర్వ విద్యార్థుల పురస్కారాలు
అత్యంత ప్రతిభావంతులకు పూర్వ విద్యార్థుల పురస్కారాలు
K.RAVI
చౌటుప్పల్ జడ్పీహెచ్ఎస్
పాఠశాలలో ఘనంగా బహుమతుల ప్రధానోత్సవం
ఏకాగ్రత, క్రమశిక్షణతో విద్యనభ్యసించినప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని విశ్రాంత మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) ఎం.ఎస్. కృష్ణమూర్తి అన్నారు. చౌటుప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1978- 79 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో 2025- 26 విద్యా సంవత్సరంలో 9, 10వ తరగతుల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పారితోషికం, జ్ఞాపికలతో పురస్కారాలను అందజేశారు. పాఠశాల గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శివకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎం.ఎస్. కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే దేశం పట్ల భక్తి, ధర్మం పట్ల అనురక్తిని పెంపొందించుకోవాలని, గురువులను గౌరవిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సిద్ధార్థి పురస్కారం 10వ తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచిన యం. డి. సమ్రీన్, శ్రీ విద్యా పురస్కారం ఇంగ్లీషు సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన ఏ. మణి సాయి, యం. డి. ఇర్ఫాన్ బాబా, బడుగు రామస్వామి కమలమ్మ విజ్ఞాన వికాస పురస్కారం 9వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన జి. చరణ్ కుమార్ లకు పురస్కారాలను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బడుగు శ్రీరాములు, కళ్లెం అంజిరెడ్డి, చింతల కరుణాకర్ రెడ్డి, కర్నాటి సత్యనారాయణ, బొబ్బిళ్ళ వెంకటేశ్వర కుమార్, అంబటి ప్రమీల, లలిత, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి