సూర్యాపేట ఆత్మకూర్(ఎస్) మండలంలోని మిడతనపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొంపెల్లి సత్తిరెడ్డిని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మర్యాదపూర్వకంగా పరామర్శించారు.
ఇటీవల అనారోగ్యానికి గురైన సత్తిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సర్వోత్తమ్ రెడ్డి, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సత్తిరెడ్డి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఆయన అనుభవం పార్టీకి ఎంతో విలువైనదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సత్తిరెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై నాయకులతో స్వల్పంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి