తూమ్నూర్, మొగ్దంపూర్ గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం
తూమ్నూర్, మొగ్దంపూర్ గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలంలోని తూమ్నూర్,మొగ్దంపూర్ గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) నిధులతో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి శంకుస్థాపన చేశారు. తున్నూర్ గ్రామంలో రూ.10 లక్షలు, మొగ్దంపూర్ గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టనున్న పనులను నాణ్యతతో, త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి గ్రామంలో రహదారులు, డ్రైనేజీ, తాగునీటి వంటి మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు అందించి మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, సర్పంచులు మోహన్రెడ్డి, సంజీవులు, విష్ణువర్ధన్రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి