Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూలై 31లోపు రేషన్ ఈ-కేవైసీ పూర్తి చేయండి: రేషన్ డీలర్ నాగూర్ మారుతి తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 27, 2026 04:30 PM

ఫీజు బకాయిలు విడుదల చేయాలి.. నార్కట్‌పల్లిలో విద్యార్థుల ధర్నా

ఫీజు బకాయిలు విడుదల చేయాలి.. నార్కట్‌పల్లిలో విద్యార్థుల ధర్నా

ఫీజు బకాయిలు విడుదల చేయాలి.. నార్కట్‌పల్లిలో విద్యార్థుల ధర్నా
July 27, 2026 02:21 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఫీజుల కోసం ఫైర్.. నార్కట్‌పల్లిలో విద్యార్థుల రాస్తారోకో.


జీవో-9, ఆర్‌ఆర్ యాక్ట్ రద్దుకు డిమాండ్.. పోలీసులతో తోపులాట


నార్కట్‌పల్లి, జూలై 27:

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో సోమవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ, పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న జీవో నెం.9 మరియు ఆర్‌ఆర్ యాక్ట్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఆందోళన సందర్భంగా విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, విద్యార్థి నాయకులు–పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారినప్పటికీ పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి తొలగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ప్రభుత్వం తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని, వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News