ఫీజు బకాయిలు విడుదల చేయాలి.. నార్కట్పల్లిలో విద్యార్థుల ధర్నా
ఫీజు బకాయిలు విడుదల చేయాలి.. నార్కట్పల్లిలో విద్యార్థుల ధర్నా
Komidala Mahender reddy
ఫీజుల కోసం ఫైర్.. నార్కట్పల్లిలో విద్యార్థుల రాస్తారోకో.
జీవో-9, ఆర్ఆర్ యాక్ట్ రద్దుకు డిమాండ్.. పోలీసులతో తోపులాట
నార్కట్పల్లి, జూలై 27:
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో సోమవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ, పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న జీవో నెం.9 మరియు ఆర్ఆర్ యాక్ట్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఆందోళన సందర్భంగా విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, విద్యార్థి నాయకులు–పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారినప్పటికీ పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి తొలగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ప్రభుత్వం తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని, వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి