భక్తుల సౌకర్యమే లక్ష్యం.. సంగమేశ్వర ఆలయం వద్ద మెట్ల నిర్మాణానికి శ్రీకారం
భక్తుల సౌకర్యమే లక్ష్యం.. సంగమేశ్వర ఆలయం వద్ద మెట్ల నిర్మాణానికి శ్రీకారం
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం బోరంచ గ్రామంలోని ప్రాచీన శ్రీ సంగమేశ్వర ఆలయం నదీ తీరంలో భక్తుల సౌకర్యార్థం రూ.10 లక్షల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ (MGNREGS) నిధులతో నిర్మించనున్న మెట్ల పనులకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య సందర్భంగా వేలాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం ఆలయానికి తరలివస్తుండటంతో వారికి సురక్షితంగా నదిలోకి దిగేందుకు, అలాగే బోటింగ్ ప్లాట్ఫారమ్ను సులభంగా వినియోగించుకునేందుకు ఈ మెట్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.రాబోయే రోజుల్లో సంగమేశ్వర ఆలయాన్ని మరిన్ని నిధులతో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భోజీ రెడ్డి, దిగంబర్ రెడ్డి, సర్పంచ్ బీరప్ప కురుమ, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధరెడ్డి, మానూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శేరి రాజు, గ్రామ వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి