తిరుమలగిరి మండల మోడ్రన్ కబడ్డీ అధ్యక్షుడుగా భూమా అంజనేయులు
తిరుమలగిరి మండల మోడ్రన్ కబడ్డీ అధ్యక్షుడుగా భూమా అంజనేయులు
Bandi Kiran Kumar
సూర్యాపేట జిల్లాతిరుమలగిరి మండల కేంద్రంలోమోడ్రన్ కబడ్డీసూర్యాపేట జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోర్తాల నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మండల మోడ్రన్ కబడ్డీ నూతన కమిటీని ఎన్నుకున్నారు.
ఈ ఎన్నికల్లో మండల అధ్యక్షునిగా భూమా అంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా నిమ్మనగోటి గణేష్, కోశాధికారిగా భూక్య సుమన్, ఉపాధ్యక్షునిగా పులిమామిడి గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.... తిరుమలగిరి మండలంలో కబడ్డీ క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని, గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు కబడ్డీపై ఆసక్తి పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీడీ అంబేద్కర్, క్రీడాకారులు లోకేష్, ఓంకార్, విష్ణు, సచిన్ పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మోర్తాల నాగిరెడ్డి నూతన కమిటీ సభ్యులను అభినందిస్తూ, జిల్లాలో కబడ్డీ క్రీడాభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి