Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తిరుమలగిరి మండల మోడ్రన్ కబడ్డీ అధ్యక్షుడుగా భూమా అంజనేయులు తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 26, 2026 06:55 PM

ఎస్ ఐ సతీష్ చాకచక్యం.. భారీ కల్తీ అల్లం పేస్ట్ దందా బట్టబయలు

ఎస్ ఐ సతీష్ చాకచక్యం.. భారీ కల్తీ అల్లం పేస్ట్ దందా బట్టబయలు

ఎస్ ఐ సతీష్ చాకచక్యం.. భారీ కల్తీ అల్లం పేస్ట్ దందా బట్టబయలు
July 26, 2026 12:14 PM 138 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో వ్యాన్ పట్టివేత

డ్రైవర్ విచారణతో కీసరలో అక్రమ తయారీ కేంద్రంపై దాడులు

భారీగా కల్తీ పేస్ట్, ముడి పదార్థాలు, యంత్రాలు స్వాధీనం.. కేసు నమోదు

రామన్నపేటలో ఎస్ ఐ జి. సతీష్ అప్రమత్తతతో భారీ కల్తీ అల్లం పేస్ట్ తయారీ, రవాణా దందా గుట్టురట్టైంది. సాధారణ వాహన తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ వ్యాన్‌ను ఆపి తనిఖీ చేయగా, ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో అల్లం పేస్ట్ డబ్బాలను తరలిస్తున్నట్లు గుర్తించారు.

వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ఎస్ ఐ సతీష్ విచారించగా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసరలో అక్రమంగా అల్లం పేస్ట్ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి పర్యవేక్షణలో, రామన్నపేట సీఐ ఎం. రవి నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి కీసరలోని తయారీ కేంద్రంపై సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

తనిఖీల్లో భారీ మొత్తంలో కల్తీ అల్లం పేస్ట్, నాసిరకం ముడి పదార్థాలు, తయారీ యంత్రాలు, ప్యాకింగ్ సామగ్రి, సిద్ధంగా ఉన్న ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎస్ ఐ అప్రమత్తతతోనే వెలుగులోకి...

సాధారణ వాహన తనిఖీని కూడా నిశితంగా నిర్వహించిన ఎస్సై జి. సతీష్ సమయస్ఫూర్తితోనే ఈ భారీ కల్తీ ఆహార దందా వెలుగులోకి వచ్చింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. ఈ చర్యను స్థానికులు అభినందిస్తూ, ఎస్సై సతీష్ అప్రమత్తత వల్లే పెద్ద ఎత్తున కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్‌లోకి వెళ్లకుండా అడ్డుకట్ట పడిందని ప్రశంసించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News