ఎస్ ఐ సతీష్ చాకచక్యం.. భారీ కల్తీ అల్లం పేస్ట్ దందా బట్టబయలు
ఎస్ ఐ సతీష్ చాకచక్యం.. భారీ కల్తీ అల్లం పేస్ట్ దందా బట్టబయలు
Editor Desk
రామన్నపేటలో వ్యాన్ పట్టివేత
డ్రైవర్ విచారణతో కీసరలో అక్రమ తయారీ కేంద్రంపై దాడులు
భారీగా కల్తీ పేస్ట్, ముడి పదార్థాలు, యంత్రాలు స్వాధీనం.. కేసు నమోదు
రామన్నపేటలో ఎస్ ఐ జి. సతీష్ అప్రమత్తతతో భారీ కల్తీ అల్లం పేస్ట్ తయారీ, రవాణా దందా గుట్టురట్టైంది. సాధారణ వాహన తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ వ్యాన్ను ఆపి తనిఖీ చేయగా, ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో అల్లం పేస్ట్ డబ్బాలను తరలిస్తున్నట్లు గుర్తించారు.
వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ఎస్ ఐ సతీష్ విచారించగా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసరలో అక్రమంగా అల్లం పేస్ట్ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్రెడ్డి పర్యవేక్షణలో, రామన్నపేట సీఐ ఎం. రవి నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి కీసరలోని తయారీ కేంద్రంపై సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
తనిఖీల్లో భారీ మొత్తంలో కల్తీ అల్లం పేస్ట్, నాసిరకం ముడి పదార్థాలు, తయారీ యంత్రాలు, ప్యాకింగ్ సామగ్రి, సిద్ధంగా ఉన్న ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎస్ ఐ అప్రమత్తతతోనే వెలుగులోకి...
సాధారణ వాహన తనిఖీని కూడా నిశితంగా నిర్వహించిన ఎస్సై జి. సతీష్ సమయస్ఫూర్తితోనే ఈ భారీ కల్తీ ఆహార దందా వెలుగులోకి వచ్చింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. ఈ చర్యను స్థానికులు అభినందిస్తూ, ఎస్సై సతీష్ అప్రమత్తత వల్లే పెద్ద ఎత్తున కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట పడిందని ప్రశంసించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి