Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దండు మల్కాపురంలో ఘనంగా వనమహోత్సవం తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 25, 2026 11:28 PM

ఎల్బీనగర్‌లో ఎం ఆర్ పి ఎస్ నిరసన

ఎల్బీనగర్‌లో ఎం ఆర్ పి ఎస్ నిరసన

ఎల్బీనగర్‌లో ఎం ఆర్ పి ఎస్ నిరసన
July 25, 2026 09:20 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం ఎల్బీనగర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జగ్జీవన్ రాం విగ్రహల వద్ద దళిత, బీసీ సంఘాల నాయకులు నిరసన చేసారు. తెలంగాణ దళిత సంఘాల జేఏసీ ఛైర్మన్ ఈదుల పరశురామ్ మాదిగ, బీసీ పీపుల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దళిత సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని విమర్శించారు. శామ్యూల్ ఉద్యమ కాలం నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ, పోరాటాల ద్వారా ప్రజా నాయకుడిగా ఎదిగారని పేర్కొన్నారు. తానే టికెట్ ఇప్పించానని, డబ్బులు ఖర్చు పెట్టానని చెప్పడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత మూడు దశాబ్దాలుగా దళితులకు సరైన ప్రాతినిధ్యం, మంత్రి పదవులు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజగోపాల్ రెడ్డి వెంటనే మందుల శామేలుకు, తుంగతుర్తి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే మునుగోడు నియోజకవర్గంలోని దళితులను ఏకం చేసి కోమటిరెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంకా ఆధిపత్య రాజకీయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధుల గురించి "మేమే టికెట్ ఇచ్చాం, మేమే ఎమ్మెల్యేలను చేశాం" అని మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ వనరుల పరిరక్షణ సమితి గోరా.శ్యాంసుందర్ గౌడ్ తెలంగాణ దళిత స్టూడెంట్ ఫెడరేషన్ మచ్చగిరి, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News