ఆపరేషన్ ముస్కాన్'పై పోలీసుల ఫోకస్. తప్పిపోయిన చిన్నారుల రక్షణకు శాఖల సమన్వయమే కీలకం..
ఆపరేషన్ ముస్కాన్'పై పోలీసుల ఫోకస్. తప్పిపోయిన చిన్నారుల రక్షణకు శాఖల సమన్వయమే కీలకం..
Editor Desk
జిల్లాలో తప్పిపోయిన, సంరక్షణ అవసరమైన చిన్నారులను గుర్తించి సురక్షితంగా కుటుంబాలకు చేర్చేందుకు చేపడుతున్న 'ఆపరేషన్ ముస్కాన్' అమలును మరింత పటిష్ఠం చేయాలని యాదాద్రి భువనగిరి పోలీసులు నిర్ణయించారు. జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం భువనగిరిలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కన్వర్జెన్స్ సమావేశంలో ఈ మేరకు కార్యాచరణపై సమీక్షించారు.అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తప్పిపోయిన చిన్నారులను గుర్తించడం, రక్షించడం, పునరావాసం కల్పించడం, బాలల సంరక్షణకు సంబంధించిన శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రతి చిన్నారి భద్రత ప్రభుత్వంతో పాటు సమాజం బాధ్యతేనని, అన్ని శాఖలు సమష్టిగా పనిచేయాలని అదనపు ఎస్పీ సూచించారు.ఈ సందర్భంగా డీసీఆర్బీ సీఐ హనుమంత్ నాయక్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ జయశ్రీ, సభ్యుడు దశరథ్, ఎన్జీఓ ప్రతినిధి సోమ నర్సయ్య, భరోసా ఎస్ఐ సంధ్యతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి