పోలీసుల వేగవంతమైన చర్యలతో కుటుంబ సభ్యులకు అప్పగింత
న్యాల్కల్ మండల్ బసంతాపూర్ గ్రామానికి చెందిన 80 ఏళ్ల ఆమీనాబీ అదృశ్యమైన ఘటనపై హద్నూర్ పోలీసులు వేగంగా స్పందించారు. సోమవారం తన కుమార్తె ఇంటికి వెళ్లిన ఆమీనాబీ తిరిగి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
ఈ విషయమై ఆమె మనవడు తాహిర్బీ సోమవారం మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో హద్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు చేపట్టిన వేగవంతమైన చర్యలతో కేవలం నాలుగు గంటల్లోనే ఆమీనాబీ ఆచూకీని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ తెలిపారు. పోలీసుల చర్యలపై కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి