కోదాడ ఎంఈవో, స్థానిక బాలుర ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ సలీం షరీఫ్ రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం అందుకోవడం పట్ల కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుండెపంగు రమేష్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం బాలుర ఉన్నత పాఠశాలలో సలీం షరీఫ్ను మర్యాదపూర్వకంగా కలిసి, పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా గుండెపంగు రమేష్ మాట్లాడుతూ మూడు దశాబ్దాల అంకితభావానికి, విద్యా సేవలకు దక్కిన అరుదైన గౌరవం ఈ అవార్డు అని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సలీం షరీఫ్ ఈ పురస్కారాన్ని స్వీకరించడం కోదాడకే గర్వకారణమన్నారు. ఉపాధ్యాయుడిగా, హెచ్ఎంగా, ఎంఈవోగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచడంలో, పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంలో ఆయన కృషి అభినందనీయమన్నారు. బాసర ఐఐఐటీ, స్కాలర్షిప్లలో విద్యార్థులు సీట్లు సాధించేలా ప్రోత్సహించారని, దాతలు, పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాల మౌలిక వసతులు అభివృద్ధి చేశారని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్ యెషయా, గంధం పాండు, బరపటి కోటేశ్వరరావు, కుడుముల రాంబాబు, అమరబోయిన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.....

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి