Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చలో అసెంబ్లీ’కి బయలుదేరిన బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 10:19 AM

వైభవంగా వెలిమినేడులో ముత్యాలమ్మ బోనాలు

వైభవంగా వెలిమినేడులో ముత్యాలమ్మ బోనాలు

వైభవంగా వెలిమినేడులో ముత్యాలమ్మ బోనాలు
07-09-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. భారీగా తరలివచ్చిన భక్తులు.


చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ముత్యాలమ్మ బోనాల పండుగను ఆదివారం వైభవంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు బోనాలతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి భక్తిని చాటుకున్నారు.

ఈ వేడుకల్లో గ్రామ ఉపసర్పంచ్ అంతటి స్వప్న–సత్తయ్య గౌడ్ దంపతులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంతటి నరసింహ గౌడ్ అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. బోనాల పండుగను పురస్కరించుకుని గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు లోడే చిరంజీవి గౌడ్, నోముల రాము, దేశబోయిన మంజుల–మల్లేష్, మహంకాళి లింగస్వామి, జనగాం మంగమ్మ–సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గోలి నరేష్, బద్దం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

వైభవంగా వెలిమినేడులో ముత్యాలమ్మ బోనాలు

Article Image

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. భారీగా తరలివచ్చిన భక్తులు.


చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ముత్యాలమ్మ బోనాల పండుగను ఆదివారం వైభవంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు బోనాలతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి భక్తిని చాటుకున్నారు.

ఈ వేడుకల్లో గ్రామ ఉపసర్పంచ్ అంతటి స్వప్న–సత్తయ్య గౌడ్ దంపతులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంతటి నరసింహ గౌడ్ అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. బోనాల పండుగను పురస్కరించుకుని గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు లోడే చిరంజీవి గౌడ్, నోముల రాము, దేశబోయిన మంజుల–మల్లేష్, మహంకాళి లింగస్వామి, జనగాం మంగమ్మ–సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గోలి నరేష్, బద్దం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News