Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల ఐక్యతకు మరో ముందడుగు.. నూతన యూనియన్ ఐడీ కార్డుల పంపిణీ భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 09:44 PM

అంకితభావానికి దక్కిన గుర్తింపు: అనితకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

అంకితభావానికి దక్కిన గుర్తింపు: అనితకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

అంకితభావానికి దక్కిన గుర్తింపు: అనితకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
05-09-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాజాపేట జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయురాలికి జిల్లా స్థాయి అవార్డు ప్రదానం

అవార్డు ప్రదానం చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, అధికారులు

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజాపేట జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో బయో-సైన్స్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎ. అనిత జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. శనివారం భువనగిరి కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీఈఓ బిక్షపతి, జెడ్పీ సీఈఓ శోభారాణి చేతుల మీదుగా ఆమె ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకని ఘన సన్మానం పొందారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, నైతిక విలువలను పెంపొందించడంలో ఆమె అందిస్తున్న విశేష సేవలకు గానూ ఈ పురస్కారం లభించింది. అవార్డు గ్రహీత అనిత మాట్లాడుతూ— "ఈ గౌరవం నా ఒక్కదానిదే కాదు. నా విద్యార్థుల ప్రేమ, తోటి ఉపాధ్యాయుల ప్రోత్సాహం, అధికారుల మార్గదర్శకత్వానికి దక్కిన ఫలితం. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే ఉపాధ్యాయ వృత్తికి నిజమైన సార్థకత. ఈ అవార్డు నాలో బాధ్యతను మరింత పెంచింది. నా ఈ గౌరవాన్ని పాఠశాలకు, విద్యార్థులకు అంకితం చేస్తున్నాను" అని భావోద్వేగంతో తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన అనితను టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇ. మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సీహెచ్ పురుషోత్తమాచారి, డెక్కన్ క్రానికల్ యూనియన్ జనరల్ సెక్రటరీ కె. జగన్మోహన్‌రెడ్డి, జైకేసరం జెడ్పీహెచ్‌ఎస్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జే శ్రీనివాస్, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు.

Sthanikam

అంకితభావానికి దక్కిన గుర్తింపు: అనితకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

Article Image

రాజాపేట జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయురాలికి జిల్లా స్థాయి అవార్డు ప్రదానం

అవార్డు ప్రదానం చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, అధికారులు

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజాపేట జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో బయో-సైన్స్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎ. అనిత జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. శనివారం భువనగిరి కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీఈఓ బిక్షపతి, జెడ్పీ సీఈఓ శోభారాణి చేతుల మీదుగా ఆమె ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకని ఘన సన్మానం పొందారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, నైతిక విలువలను పెంపొందించడంలో ఆమె అందిస్తున్న విశేష సేవలకు గానూ ఈ పురస్కారం లభించింది. అవార్డు గ్రహీత అనిత మాట్లాడుతూ— "ఈ గౌరవం నా ఒక్కదానిదే కాదు. నా విద్యార్థుల ప్రేమ, తోటి ఉపాధ్యాయుల ప్రోత్సాహం, అధికారుల మార్గదర్శకత్వానికి దక్కిన ఫలితం. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే ఉపాధ్యాయ వృత్తికి నిజమైన సార్థకత. ఈ అవార్డు నాలో బాధ్యతను మరింత పెంచింది. నా ఈ గౌరవాన్ని పాఠశాలకు, విద్యార్థులకు అంకితం చేస్తున్నాను" అని భావోద్వేగంతో తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన అనితను టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇ. మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సీహెచ్ పురుషోత్తమాచారి, డెక్కన్ క్రానికల్ యూనియన్ జనరల్ సెక్రటరీ కె. జగన్మోహన్‌రెడ్డి, జైకేసరం జెడ్పీహెచ్‌ఎస్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జే శ్రీనివాస్, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News