Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధ్యాయుడే సమాజానికి దిక్సూచి భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 07:13 PM

రేవంత్‌తో విభేదాల్లేవు...కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టీకరణ

రేవంత్‌తో విభేదాల్లేవు...కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టీకరణ

రేవంత్‌తో విభేదాల్లేవు...కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టీకరణ
05-09-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

మునుగోడుపై నిధుల వర్షం.. రేవంత్‌తో విభేదాల్లేవు...కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టీకరణ

నల్లగొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి రాజకీయ, వ్యక్తిగత విభేదాలు లేవని, ఆయనను తానెప్పుడూ దూషించలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఒకటి రెండు విధానపరమైన అంశాల్లో తప్ప, సీఎంతో తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని పేరొన్నారు.

​రూ.2 వేల కోట్ల నిధుల మంజూరు...

​మునుగోడు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. కొడంగల్, మధిర నియోజకవర్గాల తరహాలోనే మునుగోడుకు కూడా భారీగా నిధులు వచ్చాయని వెల్లడించారు. "ఇప్పటివరకు మునుగోడు అభివృద్ధికి ప్రభుత్వం రూ. 2,000 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో మౌలిక వసతులు, రహదారులు, తాగు, సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతాయి" అని ఆయన పేర్కొన్నారు.

బహిరంగ సభకు భారీగా తరలివెళ్తాం...

​త్వరలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గం నుంచి వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులతో కలిసి సభకు హాజరవుతామని చెప్పారు. ఇక రాష్ట్రంలో రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై స్పందిస్తూ.. మంత్రిపదవుల కేటాయింపు అనేది కాంగ్రెస్ అధిష్టానం పరిధిలోని అంశమని, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.


Sthanikam

రేవంత్‌తో విభేదాల్లేవు...కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టీకరణ

Article Image

మునుగోడుపై నిధుల వర్షం.. రేవంత్‌తో విభేదాల్లేవు...కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టీకరణ

నల్లగొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి రాజకీయ, వ్యక్తిగత విభేదాలు లేవని, ఆయనను తానెప్పుడూ దూషించలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఒకటి రెండు విధానపరమైన అంశాల్లో తప్ప, సీఎంతో తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని పేరొన్నారు.

​రూ.2 వేల కోట్ల నిధుల మంజూరు...

​మునుగోడు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. కొడంగల్, మధిర నియోజకవర్గాల తరహాలోనే మునుగోడుకు కూడా భారీగా నిధులు వచ్చాయని వెల్లడించారు. "ఇప్పటివరకు మునుగోడు అభివృద్ధికి ప్రభుత్వం రూ. 2,000 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో మౌలిక వసతులు, రహదారులు, తాగు, సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతాయి" అని ఆయన పేర్కొన్నారు.

బహిరంగ సభకు భారీగా తరలివెళ్తాం...

​త్వరలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గం నుంచి వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులతో కలిసి సభకు హాజరవుతామని చెప్పారు. ఇక రాష్ట్రంలో రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై స్పందిస్తూ.. మంత్రిపదవుల కేటాయింపు అనేది కాంగ్రెస్ అధిష్టానం పరిధిలోని అంశమని, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News