మంచాల్, సెప్టెంబర్ 5: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా–తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 7న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న విద్యార్థుల మహా ధర్నాకు మంచాల్ మండలం నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావాలని బీజేపీ మంచాల్ మండల అధ్యక్షులు నూకం రాజు ముదిరాజ్ పిలుపునిచ్చారు.
“ఫీజుల బకాయి–బీజేపీ లడాయి” పేరుతో నిర్వహిస్తున్న ఈ మహా ధర్నాలో విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు తెలిపారు. ఫీజుల బకాయిలతో విద్యార్థులు, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మండలంలోని వివిధ గ్రామాలు, కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చి మహా ధర్నాను విజయవంతం చేయాలని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు వెదిరే జగదీశ్వర్ రెడ్డి, కారింగు రాజు గౌడ్ కోరారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం జరిగే పోరాటంలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి