లక్ష మందితో ఉద్యోగ హక్కుల సాధన సభ.. జేఏసీ చైర్మన్ మారం జగదీశ్.
నల్గొండ: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 10న హైదరాబాద్లో నిర్వహించనున్న ‘ఉద్యోగ హక్కుల సాధన సభ–చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్ పిలుపునిచ్చారు. నల్గొండ పట్టణంలోని టీఎన్జీ భవన్లో శుక్రవారం నిర్వహించిన నల్గొండ–సూర్యాపేట జిల్లాల TGEJAC సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులతో భారీగా హైదరాబాద్కు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.సెప్టెంబర్ 10న హైదరాబాద్లో లక్ష మంది ఉద్యోగులతో భారీ సభ నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని నాయకులు తెలిపారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఉద్యోగులను తరలించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.సమావేశంలో ఏలూరి శ్రీనివాసరావు, PRTU రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి, TSUTF JAC కో-చైర్మన్ చావా రవి, TNGOs రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్, అసోసియేట్ అధ్యక్షులు సత్యనారాయణగౌడ్, కస్తూరి వెంకటేశ్వర్లు, PRTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా TGEJAC భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు నాగిళ్ల మురళి అధ్యక్షతన సమావేశమై ఉద్యమ కార్యాచరణపై సమాలోచనలు చేశారు.ఐక్యతే బలం.. పోరాటమే మార్గం అనే నినాదంతో ఉద్యోగుల హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’ను చారిత్రాత్మక విజయంగా నిలపాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి