Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు వైభవంగా పుష్పాభిషేకం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 11:53 PM

టీజీజాక్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’

టీజీజాక్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’

టీజీజాక్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’
03-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్లగొండలో గర్జించిన ఉద్యోగ సంఘాల సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’

నల్లగొండ: పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు పోరుబాట పట్టాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో తెలంగాణ ఎన్జీవో (TNGO), తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అలసత్వం వహిస్తే రణరంగమే..!

సమావేశంలో మాట్లాడిన ఉద్యోగ సంఘాల నేతలు సర్కారు వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “సిపిఎస్ (CPS) రద్దు, పెండింగ్ డిఏల (DA) విడుదల, నూతన వేతన సవరణ కమిషన్ (PRC) అమలు, సార్వత్రిక ఆరోగ్య కార్డులు (Health Cards) అందించడం వంటి కీలక సమస్యలపై ప్రభుత్వం ఇంకా జాప్యం చేయడం తగదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలి” అని నాయకులు స్పష్టం చేశారు.

సిఎం సమక్షంలో సభ.. లేదంటే ఉద్యమ తీవ్రత!

రాబోయే సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో భారీ ఎత్తున 'ఉద్యోగుల హక్కుల సాధన సభ' నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు రికార్డు స్థాయిలో తరలివచ్చేలా కార్యాచరణ రూపొందించారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి మా డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉద్యోగుల అభినందనలు అందుకుంటారా? లేక నిర్లక్ష్యం వహించి నిరసనలకు, ఉద్యమాలకు దారితీస్తారా? తేల్చుకోవాల్సింది ముఖ్యమంత్రే అని నాయకులు హెచ్చరించారు.ఇకపై ఎటువంటి ఆలస్యానికి తావులేకుండా ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.


Sthanikam

టీజీజాక్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’

Article Image

నల్లగొండలో గర్జించిన ఉద్యోగ సంఘాల సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’

నల్లగొండ: పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు పోరుబాట పట్టాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో తెలంగాణ ఎన్జీవో (TNGO), తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అలసత్వం వహిస్తే రణరంగమే..!

సమావేశంలో మాట్లాడిన ఉద్యోగ సంఘాల నేతలు సర్కారు వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “సిపిఎస్ (CPS) రద్దు, పెండింగ్ డిఏల (DA) విడుదల, నూతన వేతన సవరణ కమిషన్ (PRC) అమలు, సార్వత్రిక ఆరోగ్య కార్డులు (Health Cards) అందించడం వంటి కీలక సమస్యలపై ప్రభుత్వం ఇంకా జాప్యం చేయడం తగదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలి” అని నాయకులు స్పష్టం చేశారు.

సిఎం సమక్షంలో సభ.. లేదంటే ఉద్యమ తీవ్రత!

రాబోయే సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో భారీ ఎత్తున 'ఉద్యోగుల హక్కుల సాధన సభ' నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు రికార్డు స్థాయిలో తరలివచ్చేలా కార్యాచరణ రూపొందించారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి మా డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉద్యోగుల అభినందనలు అందుకుంటారా? లేక నిర్లక్ష్యం వహించి నిరసనలకు, ఉద్యమాలకు దారితీస్తారా? తేల్చుకోవాల్సింది ముఖ్యమంత్రే అని నాయకులు హెచ్చరించారు.ఇకపై ఎటువంటి ఆలస్యానికి తావులేకుండా ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News