Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సౌమ్య విద్యామందిర్‌లో ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు. నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 06:02 PM

కృష్ణుడి వేషాల్లో చిన్నారుల సందడి

కృష్ణుడి వేషాల్లో చిన్నారుల సందడి

కృష్ణుడి వేషాల్లో చిన్నారుల సందడి
03-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

గ్రీన్‌గ్రోవ్ పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్‌గ్రోవ్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం చిన్నారుల కృష్ణ, రాధ, గోపికల వేషధారణలతో సందడిగా మారింది. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి శ్రీకృష్ణుడు అందించిన భగవద్గీత బోధనలు మానవ జీవితానికి దిశానిర్దేశం చేస్తాయని అన్నారు. ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించాలనే సందేశం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.కష్టాలు ఎదురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని, ధర్మం కోసం నిలబడాలని శ్రీకృష్ణుడి బోధనలు మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. కోపం, అహంకారం, మితిమీరిన ఆశలను అదుపులో ఉంచుకుని సమతాభావంతో జీవించాలని సూచించారు.పండుగల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలపై అవగాహన పెంపొందుతుందని పేర్కొన్నారు. అనంతరం చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, భక్తిగీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో పాఠశాల ఏవో పోల గోవర్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


Sthanikam

కృష్ణుడి వేషాల్లో చిన్నారుల సందడి

Article Image

గ్రీన్‌గ్రోవ్ పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్‌గ్రోవ్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం చిన్నారుల కృష్ణ, రాధ, గోపికల వేషధారణలతో సందడిగా మారింది. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి శ్రీకృష్ణుడు అందించిన భగవద్గీత బోధనలు మానవ జీవితానికి దిశానిర్దేశం చేస్తాయని అన్నారు. ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించాలనే సందేశం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.కష్టాలు ఎదురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని, ధర్మం కోసం నిలబడాలని శ్రీకృష్ణుడి బోధనలు మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. కోపం, అహంకారం, మితిమీరిన ఆశలను అదుపులో ఉంచుకుని సమతాభావంతో జీవించాలని సూచించారు.పండుగల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలపై అవగాహన పెంపొందుతుందని పేర్కొన్నారు. అనంతరం చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, భక్తిగీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో పాఠశాల ఏవో పోల గోవర్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News