Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పైప్‌లైన్ పగిలి.. వీధుల పాలైన తాగునీరు! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 04:35 PM

కబేళాకు అక్రమంగా పశువుల రవాణా: 26 ఆవుల రక్షణ

కబేళాకు అక్రమంగా పశువుల రవాణా: 26 ఆవుల రక్షణ

కబేళాకు అక్రమంగా పశువుల రవాణా: 26 ఆవుల రక్షణ
03-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ లో అడ్డుకున్న బజరంగ్‌దళ్ కార్యకర్తలు

చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం గ్రామం వద్ద కబేళాలకు అక్రమంగా తరలిస్తున్న 26 పశువులను పోలీసులు, బజరంగ్‌దళ్ కార్యకర్తలు గురువారం రక్షించారు. ​రాజమండ్రి నుంచి హైదరాబాద్‌లోని బహదూర్‌పుర ప్రాంతానికి భారీగా పశువులను తరలిస్తున్నట్లు బజరంగ్‌దళ్ కార్యకర్తలకు సమాచారం అందింది. వారు వెంటనే అప్రమత్తమై ధర్మోజీగూడెం క్రాస్ రోడ్ వద్ద వాహనాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.​చౌటుప్పల్ హెడ్ కానిస్టేబుల్ నరేష్ (HC-2314), హోంగార్డు HG-92 (PM-2) పోలీసు బృందం వెంటనే అక్కడికి చేరుకుని వాహనాల తనిఖీలు చేపట్టారు. సందేహాస్పదంగా వచ్చిన ఐచర్ డీసీఎం (TS 08UG 8181)ను ఆపి తనిఖీ చేయగా, అందులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 26 పశువులను (16 ఆవులు, 10 ఎద్దులు) గుర్తించారు.

​వాహనాన్ని నడుపుతున్న ఈసీఐఎల్ దమైగూడకు చెందిన డ్రైవర్ ఎస్‌కే ఇస్మాయిల్ (34)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం అన్నాయపేటకు చెందిన యజమాని అసంతా వెంకన్న బాబు (55) సూచనల మేరకే వీటిని జగ్గయ్యపేట సంతలో కొనుగోలు చేసి బహదూర్‌పురకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

కబేళాకు అక్రమంగా పశువుల రవాణా: 26 ఆవుల రక్షణ

Article Image

చౌటుప్పల్ లో అడ్డుకున్న బజరంగ్‌దళ్ కార్యకర్తలు

చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం గ్రామం వద్ద కబేళాలకు అక్రమంగా తరలిస్తున్న 26 పశువులను పోలీసులు, బజరంగ్‌దళ్ కార్యకర్తలు గురువారం రక్షించారు. ​రాజమండ్రి నుంచి హైదరాబాద్‌లోని బహదూర్‌పుర ప్రాంతానికి భారీగా పశువులను తరలిస్తున్నట్లు బజరంగ్‌దళ్ కార్యకర్తలకు సమాచారం అందింది. వారు వెంటనే అప్రమత్తమై ధర్మోజీగూడెం క్రాస్ రోడ్ వద్ద వాహనాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.​చౌటుప్పల్ హెడ్ కానిస్టేబుల్ నరేష్ (HC-2314), హోంగార్డు HG-92 (PM-2) పోలీసు బృందం వెంటనే అక్కడికి చేరుకుని వాహనాల తనిఖీలు చేపట్టారు. సందేహాస్పదంగా వచ్చిన ఐచర్ డీసీఎం (TS 08UG 8181)ను ఆపి తనిఖీ చేయగా, అందులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 26 పశువులను (16 ఆవులు, 10 ఎద్దులు) గుర్తించారు.

​వాహనాన్ని నడుపుతున్న ఈసీఐఎల్ దమైగూడకు చెందిన డ్రైవర్ ఎస్‌కే ఇస్మాయిల్ (34)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం అన్నాయపేటకు చెందిన యజమాని అసంతా వెంకన్న బాబు (55) సూచనల మేరకే వీటిని జగ్గయ్యపేట సంతలో కొనుగోలు చేసి బహదూర్‌పురకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News