Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 10:36 PM

సంతకం ఫోర్జరీ చేసి రూ.20.87 లక్షలు నొక్కేశారు! 

సంతకం ఫోర్జరీ చేసి రూ.20.87 లక్షలు నొక్కేశారు! 

సంతకం ఫోర్జరీ చేసి రూ.20.87 లక్షలు నొక్కేశారు! 
02-09-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

సంతకం ఫోర్జరీ చేసి రూ.20.87 లక్షలు నొక్కేశారు! 

కలెక్టర్‌కు బాధితురాలి ఫిర్యాదు విచారణకు డిమాండ్...

నల్గొండ : అమాయకపు మహిళల నిరక్షరాస్యతను, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని సంతకాలు ఫోర్జరీ చేస్తూ లక్షలాది రూపాయల రుణాలు కాజేసిన ఘరానా మోసం కేతేపల్లి మండలంలో వెలుగుచూసింది. తన ప్రమేయం లేకుండా, సంతకాన్ని ఫోర్జరీ చేసి మహిళా సంఘం పేరుతో రూ.20 లక్షలకు పైగా రుణాలు పొంది అక్రమాలకు పాల్పడ్డారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం గ్రామానికి చెందిన పోతుగంటి జయమ్మ, గ్రామంలోని సంఘబంధం-2 పరిధిలోని 'ధనలక్ష్మి మహిళా సంఘం'లో సభ్యురాలిగా ఉంది. ఆమె అనుమతి లేకుండా, సంతకాలను ఫోర్జరీ చేసి సంఘం పేరుతో 2020 నుంచి 2024 వరకు పలు విడతలుగా బ్యాంకులు, శ్రీనిధి సంస్థల నుంచి పెద్ద ఎత్తున రుణాలు పొందినట్లు ఆరోపించింది.

ఏళ్ల తరబడి సాగిన మోసం వివరాలు...

రుణ తేదికాజేసిన మొత్తం (రూ.)14 ఫిబ్రవరి 202080,00025 ఆగస్టు 202050,00029 జూన్ 20212,00,00028 జూలై 20214,86,00029 సెప్టెంబర్ 20227,71,00029 డిసెంబర్ 20233,00,00011 నవంబర్ 20242,00,000మొత్తం20,87,000

బ్యాంకు రుణాలతో పాటు శ్రీనిధి రుణాల విషయంలోనూ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధులు పక్కదారి పట్టించారని జయమ్మ వాపోయింది. 

అధికారులు, లీడర్ల కుమ్మక్కు? ఈ అక్రమాల వెనుక సంఘబంధం-2 విలేజ్ బుక్ కీపర్ (VBK) గుడపురి విజేత, ధనలక్ష్మి సంఘం మొదటి లీడర్ కోట నాగమ్మ, రెండో లీడర్ గుడపురి బూబాతో పాటు అప్పటి కమ్యూనిటీ కోఆర్డినేటర్ (CC) శ్రీనివాస్ రెడ్డి, ఆంధ్రాబ్యాంక్ ఫీల్డ్ అసిస్టెంట్‌ల హస్తం ఉందని బాధితురాలు ఆరోపించింది. వీరందరి పాత్రపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తో పాటు డిఆర్‌డిఓ-పిడి (DRDO-PD), డిఆర్‌డిఓ-డిపిఎం (DRDO-DPM), కేతేపల్లి ఎంపీడీఓ, డిఆర్‌డిఓ-ఏపీఎం మరియు స్థానిక పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేసింది. అక్రమంగా తన పేరు మీద మోపిన రుణభారం నుంచి విముక్తి కల్పించి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి న్యాయం చేయాలని వేడుకుంది.


Sthanikam

సంతకం ఫోర్జరీ చేసి రూ.20.87 లక్షలు నొక్కేశారు! 

Article Image

సంతకం ఫోర్జరీ చేసి రూ.20.87 లక్షలు నొక్కేశారు! 

కలెక్టర్‌కు బాధితురాలి ఫిర్యాదు విచారణకు డిమాండ్...

నల్గొండ : అమాయకపు మహిళల నిరక్షరాస్యతను, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని సంతకాలు ఫోర్జరీ చేస్తూ లక్షలాది రూపాయల రుణాలు కాజేసిన ఘరానా మోసం కేతేపల్లి మండలంలో వెలుగుచూసింది. తన ప్రమేయం లేకుండా, సంతకాన్ని ఫోర్జరీ చేసి మహిళా సంఘం పేరుతో రూ.20 లక్షలకు పైగా రుణాలు పొంది అక్రమాలకు పాల్పడ్డారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం గ్రామానికి చెందిన పోతుగంటి జయమ్మ, గ్రామంలోని సంఘబంధం-2 పరిధిలోని 'ధనలక్ష్మి మహిళా సంఘం'లో సభ్యురాలిగా ఉంది. ఆమె అనుమతి లేకుండా, సంతకాలను ఫోర్జరీ చేసి సంఘం పేరుతో 2020 నుంచి 2024 వరకు పలు విడతలుగా బ్యాంకులు, శ్రీనిధి సంస్థల నుంచి పెద్ద ఎత్తున రుణాలు పొందినట్లు ఆరోపించింది.

ఏళ్ల తరబడి సాగిన మోసం వివరాలు...

రుణ తేదికాజేసిన మొత్తం (రూ.)14 ఫిబ్రవరి 202080,00025 ఆగస్టు 202050,00029 జూన్ 20212,00,00028 జూలై 20214,86,00029 సెప్టెంబర్ 20227,71,00029 డిసెంబర్ 20233,00,00011 నవంబర్ 20242,00,000మొత్తం20,87,000

బ్యాంకు రుణాలతో పాటు శ్రీనిధి రుణాల విషయంలోనూ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధులు పక్కదారి పట్టించారని జయమ్మ వాపోయింది. 

అధికారులు, లీడర్ల కుమ్మక్కు? ఈ అక్రమాల వెనుక సంఘబంధం-2 విలేజ్ బుక్ కీపర్ (VBK) గుడపురి విజేత, ధనలక్ష్మి సంఘం మొదటి లీడర్ కోట నాగమ్మ, రెండో లీడర్ గుడపురి బూబాతో పాటు అప్పటి కమ్యూనిటీ కోఆర్డినేటర్ (CC) శ్రీనివాస్ రెడ్డి, ఆంధ్రాబ్యాంక్ ఫీల్డ్ అసిస్టెంట్‌ల హస్తం ఉందని బాధితురాలు ఆరోపించింది. వీరందరి పాత్రపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తో పాటు డిఆర్‌డిఓ-పిడి (DRDO-PD), డిఆర్‌డిఓ-డిపిఎం (DRDO-DPM), కేతేపల్లి ఎంపీడీఓ, డిఆర్‌డిఓ-ఏపీఎం మరియు స్థానిక పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేసింది. అక్రమంగా తన పేరు మీద మోపిన రుణభారం నుంచి విముక్తి కల్పించి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి న్యాయం చేయాలని వేడుకుంది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News