Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ సారాంపల్లి మల్లారెడ్డి కి ఘననివాళులు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 06:54 PM

చిన్నారుల ఆరోగ్యమే.. భావితరాల బలం! రెండేళ్ల వరకు అదనపు చక్కెర వద్దు.

చిన్నారుల ఆరోగ్యమే.. భావితరాల బలం! రెండేళ్ల వరకు అదనపు చక్కెర వద్దు.

చిన్నారుల ఆరోగ్యమే.. భావితరాల బలం!  రెండేళ్ల వరకు అదనపు చక్కెర వద్దు.
02-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిన్న వయసు నుంచే పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించాలని ఐసీఎంఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ భారతి కులకర్ణి సూచించారు. హైదరాబాద్‌ ప్రెస్‌ టూర్‌లో భాగంగా ఉత్తరాఖండ్‌కు చెందిన 15 మంది మీడియా ప్రతినిధులు బుధవారం

ఐసీఎంఆర్‌–ఎన్‌ఐఎన్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ భారతి కులకర్ణి మాట్లాడుతూ.. సమతుల ఆహారం, పోషక విలువలు, శరీరానికి అవసరమైన పోషకాలపై ఐసీఎంఆర్‌–ఎన్‌ఐఎన్‌ శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తోందన్నారు. ఇండియన్‌ ఫుడ్‌ కంపోజిషన్‌ టేబుల్స్‌ ద్వారా దేశీయ ఆహార పదార్థాల్లోని శక్తి, ప్రొటీన్‌, సూక్ష్మ పోషకాలు, ఖనిజాల వివరాలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.

రెండేళ్ల వరకు అదనపు చక్కెర వద్దు.

పిల్లలకు రెండేళ్ల వయసు వరకు అదనపు చక్కెర ఇవ్వకూడదని సూచించారు. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల పిల్లల్లో అధిక బరువు, ఊబకాయం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారం అందుబాటులో ఉండటం మాత్రమే పోషక భద్రతకు సరిపోదని, వైవిధ్యమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా అవసరమని వివరించారు.

చిరుధాన్యాలపై పరిశోధనలు.

ఉత్తరాఖండ్‌లో పండించే మండు, జంగోరా, చోలై, కోడా తదితర దేశీయ పంటలు, చిరుధాన్యాల్లోని పోషక విలువలపై పరిశోధనలు కొనసాగుతున్నాయని డాక్టర్‌ భారతి కులకర్ణి తెలిపారు. రాగుల వినియోగం రక్తహీనత తగ్గింపుపై చూపే ప్రభావాన్ని కూడా అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పోషకాహారంపై అవగాహన కల్పించాలి.

ఐసీఎంఆర్‌–ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్త, ఎన్‌ఐసీహెచ్‌ఈ విభాగం అధిపతి డాక్టర్‌ సుబ్బారావు ఎం. గవరవరపు మీడియా ప్రతినిధులకు పోషకాహార సమాచారంపై అవగాహన కల్పించారు. పోషకాహార లోపాలు, సూక్ష్మ పోషకాల కొరతతోపాటు జీవనశైలి కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలు ఏకకాలంలో కొనసాగుతున్నాయని వివరించారు. ప్రజలకు శాస్త్రీయ, ఆధారిత పోషకాహార సమాచారాన్ని అందించడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు.

.



Sthanikam

చిన్నారుల ఆరోగ్యమే.. భావితరాల బలం! రెండేళ్ల వరకు అదనపు చక్కెర వద్దు.

Article Image

చిన్న వయసు నుంచే పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించాలని ఐసీఎంఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ భారతి కులకర్ణి సూచించారు. హైదరాబాద్‌ ప్రెస్‌ టూర్‌లో భాగంగా ఉత్తరాఖండ్‌కు చెందిన 15 మంది మీడియా ప్రతినిధులు బుధవారం

ఐసీఎంఆర్‌–ఎన్‌ఐఎన్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ భారతి కులకర్ణి మాట్లాడుతూ.. సమతుల ఆహారం, పోషక విలువలు, శరీరానికి అవసరమైన పోషకాలపై ఐసీఎంఆర్‌–ఎన్‌ఐఎన్‌ శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తోందన్నారు. ఇండియన్‌ ఫుడ్‌ కంపోజిషన్‌ టేబుల్స్‌ ద్వారా దేశీయ ఆహార పదార్థాల్లోని శక్తి, ప్రొటీన్‌, సూక్ష్మ పోషకాలు, ఖనిజాల వివరాలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.

రెండేళ్ల వరకు అదనపు చక్కెర వద్దు.

పిల్లలకు రెండేళ్ల వయసు వరకు అదనపు చక్కెర ఇవ్వకూడదని సూచించారు. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల పిల్లల్లో అధిక బరువు, ఊబకాయం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారం అందుబాటులో ఉండటం మాత్రమే పోషక భద్రతకు సరిపోదని, వైవిధ్యమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా అవసరమని వివరించారు.

చిరుధాన్యాలపై పరిశోధనలు.

ఉత్తరాఖండ్‌లో పండించే మండు, జంగోరా, చోలై, కోడా తదితర దేశీయ పంటలు, చిరుధాన్యాల్లోని పోషక విలువలపై పరిశోధనలు కొనసాగుతున్నాయని డాక్టర్‌ భారతి కులకర్ణి తెలిపారు. రాగుల వినియోగం రక్తహీనత తగ్గింపుపై చూపే ప్రభావాన్ని కూడా అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పోషకాహారంపై అవగాహన కల్పించాలి.

ఐసీఎంఆర్‌–ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్త, ఎన్‌ఐసీహెచ్‌ఈ విభాగం అధిపతి డాక్టర్‌ సుబ్బారావు ఎం. గవరవరపు మీడియా ప్రతినిధులకు పోషకాహార సమాచారంపై అవగాహన కల్పించారు. పోషకాహార లోపాలు, సూక్ష్మ పోషకాల కొరతతోపాటు జీవనశైలి కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలు ఏకకాలంలో కొనసాగుతున్నాయని వివరించారు. ప్రజలకు శాస్త్రీయ, ఆధారిత పోషకాహార సమాచారాన్ని అందించడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు.

.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News