అవినీతి, కుంభకోణాలకు తావులేని సమాజ నిర్మాణమే జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లక్ష్యమని ఆ పార్టీ జిల్లా నాయకులు ఏవీ రావు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏవీ రావు మాట్లాడుతూ.. ప్రజల కోసం పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి రూపాయి అర్హులకు చేరేలా, అవినీతికి తావులేని వ్యవస్థ కోసం ఆయన కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ కీలక మార్పులకు నాంది పలుకుతారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి జనసేనను మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పలు కూడళ్లలో అన్నదానం చేశారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో భూక్య సైదులు నాయక్, దండు మధు, సాయి స్వరూప్, ఓరుగంటి జగదీశ్వరి, భూక్య రవి, లింగ నాయక్, సురేష్, సతీష్, సాయి, సైదులు, మనీష్, బాలగిరి, గణేష్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి