PRINT TIME: September 02, 2026 04:17 PM
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమమే లక్ష్యం
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమమే లక్ష్యం
02-09-2026
17 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల: పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యమిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చిట్యాల మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీత రమేష్ అన్నారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఆమె ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, భద్రత తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. కార్మికులకు నెలనెలా జీతాలు సకాలంలో అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందించారు.