వనస్థలిపురం: అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని వనస్థలిపురం పోలీసులు పట్టుకున్నారు. సోమవారం అర్ధరాత్రి సహారా రోడ్డులోని ప్రసీద ఆస్పత్రి సమీపంలో వాహన తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా వచ్చిన అశోక్ లేలాండ్ వాహనంలో 40 బస్తాల పీడీఎస్ బియ్యం గుర్తించారు.
వాహనం డ్రైవర్ గోపాల్ రాథోడ్ (40)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బియ్యంతో పాటు వాహనాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి