హయత్నగర్, సెప్టెంబర్ 1: సెప్టెంబర్ 1ని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్నగర్లో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. “పెన్షన్ భిక్ష కాదు.. పెన్షన్ హక్కు” అంటూ నినాదాలు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కళాశాల లైబ్రేరియన్ డా. ఏ. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. 2004 సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని, ఇందులో అనేక లోపాలు ఉన్నాయని అన్నారు. “పెట్టుబడుల పెన్షన్.. మాకొద్దు టెన్షన్” అంటూ ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 2.80 లక్షల మంది CPS ఉద్యోగులు ఉన్నారని, ఉద్యోగ విరమణ అనంతరం ఆశించిన స్థాయిలో పెన్షన్ అందక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగులకు భద్రత కల్పించే పాత పెన్షన్ విధానాన్ని (OPS) రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో టీజీసీజీటీఏ, టీజీసీటీఏ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి