Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడే ఎన్‌జీ కళాశాలలో జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్. ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 06:19 PM

పోషణ మాసోత్సవం–2026ను ప్రారంభించిన డా. కె. లక్ష్మణ్‌.

పోషణ మాసోత్సవం–2026ను ప్రారంభించిన డా. కె. లక్ష్మణ్‌.

పోషణ మాసోత్సవం–2026ను ప్రారంభించిన డా. కె. లక్ష్మణ్‌.
01-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆరోగ్యవంతమైన చిన్నారులతోనే ఆరోగ్యవంతమైన భారత్‌.

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1: ఆరోగ్యవంతమైన చిన్నారులతోనే దృఢమైన, ఆరోగ్యవంతమైన భారత్‌ను నిర్మించగలమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ అన్నారు. పోషణ మాసోత్సవం–2026లో భాగంగా సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ గగన్‌మహల్‌లోని ఏవీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐకాప్‌ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు రక్తహీనత, ఊబకాయం, ఎదుగుదల లోపం వంటి సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో వయసుకు తగ్గ శారీరక ఎదుగుదల లేని చిన్నారుల శాతం 33 నుంచి 27కు తగ్గిందన్నారు. చిరుధాన్యాలు, సంప్రదాయ ఆహార పద్ధతులను ప్రోత్సహించాలని, విద్యార్థులు క్రీడలు, వ్యాయామం, యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు.సీబీసీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ శ్రుతి పాటిల్‌ మాట్లాడుతూ.. పోషకాహారం ఆరోగ్యం, అభ్యాసం, జీవన నాణ్యతతో ముడిపడి ఉందన్నారు. కార్యక్రమంలో ఏవీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ కార్యదర్శి అచ్యుత్‌ ప్రసాద్‌ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పద్మ, పీఐబీ, సీబీసీ అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పోషణ మాసోత్సవం–2026ను ప్రారంభించిన డా. కె. లక్ష్మణ్‌.

Article Image

ఆరోగ్యవంతమైన చిన్నారులతోనే ఆరోగ్యవంతమైన భారత్‌.

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1: ఆరోగ్యవంతమైన చిన్నారులతోనే దృఢమైన, ఆరోగ్యవంతమైన భారత్‌ను నిర్మించగలమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ అన్నారు. పోషణ మాసోత్సవం–2026లో భాగంగా సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ గగన్‌మహల్‌లోని ఏవీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐకాప్‌ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు రక్తహీనత, ఊబకాయం, ఎదుగుదల లోపం వంటి సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో వయసుకు తగ్గ శారీరక ఎదుగుదల లేని చిన్నారుల శాతం 33 నుంచి 27కు తగ్గిందన్నారు. చిరుధాన్యాలు, సంప్రదాయ ఆహార పద్ధతులను ప్రోత్సహించాలని, విద్యార్థులు క్రీడలు, వ్యాయామం, యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు.సీబీసీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ శ్రుతి పాటిల్‌ మాట్లాడుతూ.. పోషకాహారం ఆరోగ్యం, అభ్యాసం, జీవన నాణ్యతతో ముడిపడి ఉందన్నారు. కార్యక్రమంలో ఏవీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ కార్యదర్శి అచ్యుత్‌ ప్రసాద్‌ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పద్మ, పీఐబీ, సీబీసీ అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News