కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ అన్నారు. రాహుల్గాంధీపై బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తూ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాజ్యాంగం, సామాజిక న్యాయం, దళితుల ఆత్మగౌరవం వంటి అంశాలపై ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేసులతో రాహుల్గాంధీ గొంతును అణచివేయడం సాధ్యం కాదని, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయం ఎదుట రాహుల్గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాం
రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాం
Biksham
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ అన్నారు. రాహుల్గాంధీపై బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తూ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాజ్యాంగం, సామాజిక న్యాయం, దళితుల ఆత్మగౌరవం వంటి అంశాలపై ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేసులతో రాహుల్గాంధీ గొంతును అణచివేయడం సాధ్యం కాదని, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయం ఎదుట రాహుల్గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి