రామన్నపేట,
ఎస్ఐఆర్ ఫారాలు అందుకున్న వారు వాటిని పూర్తిచేసి, గుర్తింపు ధ్రువీకరణకు సంబంధించిన ఏదైనా పత్రం జిరాక్స్ కాపీని జతచేసి సెప్టెంబర్ 9వ తేదీలోగా సంబంధిత బీఎల్ఓలకు అందజేయాలని రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరోద్దీన్ సూచించారు.మంగళవారం రామన్నపేట మండలంలోని విజ్ఞానవర్ధిని ఐటీఐలో ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న వారికి ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జమీరోద్దీన్ మాట్లాడుతూ.. ఫారాల్లో వివరాలను పూర్తిగా నమోదు చేసి, అవసరమైన గుర్తింపు పత్రం జిరాక్స్ కాపీని జతచేసి నిర్ణీత గడువులోగా బీఎల్ఓలకు అందజేయాలని కోరారు.కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వనం చంద్రశేఖర్, మహమ్మద్ కరీం, ఎండీ మన్నాన్, అక్కనేపల్లి జయకృష్ణ, తావ సంతోష్, ఎం.కె. రాహుల్, నంగునూరు విజయ్తో పాటు బీఎల్ఓలు కవిత, పుష్ప పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి